మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: నేటి ధరలు ఇవే
Recommended Video
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు శనివారం ప్రకటించిన ధరల ప్రకారం.. పెట్రోల్పై లీటర్కు 22 పైసలు, డీజిల్పై 21 పైసలు పెరిగాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.40 కాగా, డీజిల్ రూ.74.63గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్పై లీటర్కు 22 పైసల చొప్పున పెరగగా లీటర్ పెట్రోల్ రూ.90.75లు కాగా, డీజిల్ రూ.79.23లుగా ఉంది. కోల్కతాలో పెట్రోలు ధర లీటరు రూ.85.21లు ఉండగా, డీజిల్ ధర రూ.76.48గా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 86.70లు ఉండగా, డీజిల్ ధర రూ. 78.91గా ఉంది.
Petrol & Diesel prices in #Delhi are Rs 83.40 per litre (increase by Rs 0.22) & Rs 74.63 per litre (increase by Rs 0.21), respectively. Petrol & Diesel prices in #Mumbai are Rs 90.75 per litre (increase by Rs 0.22) & Rs 79.23 per litre (increase by Rs 0.22), respectively. pic.twitter.com/jI6d3dt85c
— ANI (@ANI) September 29, 2018
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.88.42లు ఉండగా, డీజిల్ రూ.81.18లు ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.44లు ఉండగా, డీజిల్ రూ.79.89లు ఉంది. పెట్రో ధరలు పెరుగుదలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదవుతోందని కేంద్రం చెబుతోంది.