మరింత రిలీఫ్: నేడూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎంతంటే?
న్యూఢిల్లీ: పెట్రో ధరలు నేడు కూడా తగ్గి వాహనదారులకు మరింత ఉపశమనం కలిగించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో గత కొద్ది రోజులుగా దేశంలో ఇంధన ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. గడిచిన ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర రూ. 2 తగ్గగా.. శనివారం కూడా ఆ తగ్గింపు కొనసాగింది.
శనివారం పెట్రోల్ ధర మరో 40 పైసలు తగ్గి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ ధర రూ. 80.45కు చేరింది. అటు డీజిల్ కూడా 35 పైసలు దిగొచ్చి లీటర్ ధర రూ. 74.38గా ఉంది.
ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబైలోనూ ఇంధన ధరలు తగ్గాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 40 పైసలు తగ్గి రూ. 85.93, డీజిల్ ధర 37 పైసలు తగ్గి రూ. 77.96గా ఉంది.
ఇటీవల రెండు నెలల పాటు ఇంధన ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోభారం నుంచి వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం అక్టోబర్ 4వ తేదీన పెట్రోల్, డీజిల్పై రూ. 2.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.