మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, నాలుగేళ్ళ తర్వాత అత్యధికం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు మళ్ళీ పెరిగాయి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలను పురస్కరించుకొని ఇంత కాలం పాటు పెట్రోల్, డీజీల్ ధరలు పెరగలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే పెట్రోల్, డీజీల్ ధరలు మరోసారి పెరిగాయి. సుమారు 19 రోజుల తర్వాత ఈ ధరలు పెరిగాయి.
సోమవారం నాడు లీటర్ పెట్రోల్ ధర రూ. 17 పైసలు పెరిగింది. డీజీల్కు లీటర్కు రూ. 21 పైసలు పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో ఈ రెండింటి దరలు పెరిగినట్టు అయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర నాలుగేళ్ళ ఎనిమిది మాసాల తర్వాత అత్యధిక ధరను నమోదు చేసినట్టైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డీజీల్ ధర లీటర్కు రూ. 66 కు చేరుకొంది. డీజీల్ ధర కూడ ఆల్టైం హైకి చేరుకొంది. కోల్కత్తాలో లీటరుక5 పైసలు, ముంబైలో 23 పైసలు, చెన్నైలో 23 పైసలు డీజీల్ కు పెరిగింది. కోల్కతాలో 18 పైసలు, ముంబైలో 17 పైసలు, చెన్నైలో లీటర్ కు 18 పైసలు పెట్రోల్ పై ధరలు పెరిగాయి.
పెరిగిన ధరల ప్రకారంగా ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు రూ. 74.8, కోల్ కత్తాలో రూ.77.5, ముంబైలో రూ.82.5, చెన్నైలో రూ.77.61లకు చేరుకొంది,. లీటర్ డీజీల్ ధర ఢిల్లీలో రూ.66.14, కోల్కత్తాలో లీటర్ డీజీల్ కు 68.68. ముంబైలో రూ. 70.43, చెన్నైలో లీటర్ డీజీల్ రూ. 69.79 చేరుకొంది.