వరుసగా 29వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు, నెల రోజుల్లో రూ.7కు పైగా తగ్గింది
న్యూఢిల్లీ: గతంలో రోజు రోజుకు పెరిగిన పెట్రోల్ ధరలు, గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు పెట్రోల్ ధర 20 పైసలు, డీజిల్ ధర 18 పైసలు తగ్గింది. పెట్రోల్ ధరలు వరుసగా 29వ రోజు తగ్గాయి. ఈ నెల రోజుల్లో పెట్రోల్ ధర రూ.7కు పైగా తగ్గింది. ఇది వినియోగదారులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు.
ఢిల్లీలో ఆదివారం పెట్రోలు ధర 20 పైసలు తగ్గి లీటరు రూ.76.71కు చేరింది. డీజిల్ ధర కూడా 18 పైసలు తగ్గి లీటరు రూ.71.56కు వచ్చింది. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతుండటం గమనార్హం.
గత నెల రోజుల్లో లీటరు పెట్రోలుపై రూ.7.29 తగ్గింది. డీజిల్ పైన రూ.3.89 తగ్గింది. ఆగస్ట్ 16వ తేదీ నుంచి పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠాలకు చేరుకున్నాయి.
అక్టోబరు 4న ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.84 వరకూ చేరుకున్నాయి. ముంబైలో రూ.91.34కు చేరింది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.75.45వద్ద ఆల్టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ముంబైలో రూ.80.10 వద్ద గరిష్ఠ ధరను నమోదు చేసింది. కానీ, అక్టోబరు 18వ తేదీ తర్వాత నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.