వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీ పెరిగిన ధరలు: పెట్రోలు రూ.1.29, డీజిల్ రూ.97 పైసలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.1.29 పైసలు, డీజిల్ ధర లీటరుకు 97 పైసలు పెంచారు.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.1.29 పైసలు, డీజిల్ ధర లీటరుకు 97 పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఈ రోజు (ఆదివారం) అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.
కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు క్రితంసారి గత ఏడాది డిసెంబర్ 16న పెరిగాయి. అప్పుడు పెట్రోల్ పైన లీటరుకు రూ.2.21, డీజిల్ పైన లీటరుకు 1.79ల చొప్పున పెరిగింది.
కాగా, అంతకుముందు డిసెంబర్ 1వ తేదీన పెట్రోల్ ధర పెరగగా, డీజిల్ ధర తగ్గింది. అప్పుడు పెట్రోలు లీటర్ పైన రూ.0.13 పైసలు పెరిగింది. డీజిల్ పైన లీటరుకు 0.12 పైసలు తగ్గాయి.
Comments
English summary
Petrol price hiked by Rs 1.29 per litre, diesel by 97 paise.