రోజువారీ మార్పులు!: భారీగా పెరిగిన పెట్రో ధర, ఎంతంటే?
పెట్రో ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు వినియోగదారులకు షాకిస్తున్నాయి. జులై 1 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ 5.79 పైసలు మేర పెరిగాయి.
న్యూఢిల్లీ: పెట్రో ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు వినియోగదారులకు షాకిస్తున్నాయి. జులై 1 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలు లీటరుకు రూ 5.79 పైసలు మేర పెరిగాయి. జులై 1న న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.63.09, రూ.53.33గా ఉంటే.. బుధవారం సమీక్షించిన లీటరు పెట్రోలు ధర రూ.68.88, లీటర్ డీజిల్ ధర రూ. 57.06గా నమోదైంది.
ప్రభుత్వం వీటికి జీఎస్టీ నుంచి విముక్తి కల్పించినప్పటికీ.. పలు రాష్ట్రాలు, కేంద్రం వేస్తున్న లెవీలు మాత్రం ధరలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అయితే, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ.. ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదని విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
అంతర్జాతీయ ధరలు దిగొస్తుంటే.. దేశీయ ధరలు తగ్గాల్సింది పోయి.. ఎక్సైజ్ పెరుగుతుందన్న సీపీఎం నేత సీతారం ఏచూరి.. ఈ ప్రభావం ధరలపై పడుతుందని అన్నారు. ఇది చాలా అన్యాయమంటూ ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.