స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ముంబైలో అత్యధికం
హైదరాబాద్: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల, దేశీయంగా పన్నుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరలు గురువారం రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున పెట్రోలు ధర 13 పైసలు, డీజిల్ ధర 11 పైసల చొప్పున పెరిగింది.
రూపాయి పతనం, ఇంధన ధరలపై ఈ వారాంతంలో ప్రధాని మోడీ సమీక్ష
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రికార్డు స్థాయిల్లో రూ. 81 మార్కును తాకింది. లీటరు డీజిల్ ధర కూడా చారిత్రాత్మక గరిష్టంలో రూ. 73.08గా నమోదైంది. ముంబైలో లీటరు పెట్రోలు ధర 15 పైసలు పెరిగి, రూ. 88.39, డీజిల్ ధర రూ. 77.58గా ఉంది.
కాగా, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై, క్షీణిస్తున్న డాలర్ మారకంలో రూపాయి విలువపై ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం చేపట్టనున్న చర్యల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.