వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రోల్ ధరలు: ఢిల్లీలో లీటర్‌కి రూ.73

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి పెట్రోల్ ధరలు భగుమంటున్నాయి. పెట్రోల్‌పై 45 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ. 73కు చేరుకుంది. వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్ ధరలు పెరగడం గమనార్హం. అయితే, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో పెట్రోల్ ధర 20 పైసలు పెరిగింది. చెన్నైలో మాత్రం 21పైసలు పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 73.05 ఉండగా, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.76గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.72గా ఉంది.

Petrol prices soar above Rs 73/ltr for 3rd consecutive day in Delhi

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 75.92గా ఉంది. డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 65.91 ఉండగా, కోల్‌కతాలో 68.32గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 69.13 కాగా, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.67గా ఉంది.

హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 77.59 ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 71.79గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 21పైసలు పెరిగింది.

English summary
Petrol prices in Delhi remained above Rs 73 per litre, with a rise of 45 paise, for the third consecutive day on Sunday. The diesel prices remained unchanged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X