వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రివేణి సంగమంలో అస్తికలు: సునంద పుష్కర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇటీవల మృతి చెందిన సునంద పుష్కర్ అస్తికలను కేంద్రమంత్రి శశి థరూర్ శనివారం కన్యాకుమారిలోని త్రివేణి సంగమంలో కలిపారు. సునంద పుష్కర్ జనవరి నెలలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆమె అస్తికలను శశి థరూర్, తనయుడు శివ మీనన్ జనవరి 21న సోమవారం గంగానదిలో కలిపారు. శశి థరూర్ నిన్న త్రివేణి సంగమంలో కలిపారు.

పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరర్‌తో తన భర్తకు సంబంధం ఉందని ఆరోపించిన మరుసటి రోజే ఆమె ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై దర్యాఫ్తు సాగుతోంది.

సునంద 1

సునంద 1

కేంద్రమంత్రి శశి థరూర్, ఆయన తల్లి, సోదరి శోభలు బుధవారం తిరువనంతపురం వచ్చారు. అతను తన సతీమణి సునంద పుష్కర్ అస్తికలు కన్యాకుమారిలో కలిపేందుకు వచ్చారు.

సునంద 2

సునంద 2

పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరర్‌తో ట్విట్టర్ వార్ తర్వాత సునంద పుష్కర్ ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకొని కనిపించారు.

సునంద 3

సునంద 3

తన తల్లి సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని ఆమె తనయుడు శివ మీనన్ గత నెల చెప్పారు. మీడియా ఒత్తిడి, టెన్షన్స్, మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం.. వంటి పలు ఒత్తిళ్లతో ఆమె అఘాయిత్యానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.

సునంద 4

సునంద 4

తన తల్లి సునంద పుష్కర్ విషయంలో కేంద్రమంత్రి శశిథరూర్ పైన వస్తున్న ఆరోపణలను తాను విశ్వసించడం లేదని శివ మీనన్ చెప్పారు. వారి మధ్య మంచి అనుబంధం ఉందన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామన్నారు.

సునంద 5

సునంద 5

ఇటీవల మృతి చెందిన సునంద పుష్కర్ అస్తికలను కేంద్రమంత్రి శశి థరూర్ శనివారం కన్యాకుమారిలోని త్రివేణి సంగమంలో కలిపారు. సునంద పుష్కర్ జనవరి నెలలో మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
Union Minister Shashi Tharoor immersed the ashes of his wife Sunanda Pushkar at Triveni Sangamam in Kanyakumari on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X