వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఐబీ చీఫ్‌కు కరోనా పాజిటివ్, కేంద్రమంత్రులతో వేదిక పంచుకున్న ధాత్‌వాలియా..

|
Google Oneindia TeluguNews

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధాత్‌వాలియాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ధాత్‌వాలియా పీఐబీ విభాగ అధిపతితోపాటు కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే బుధవారం మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ధాత్‌వాలియా వేదిక పంచుకున్నారు. దీంతో వారికి కూడా వైరస్ భయం పట్టుకుంది.

కరోనా వైరస్ రావడంతో అతనిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో ఆదివారం రాత్రి 7 గంటలకు చేర్పించారు. కోవిడ్-19 నోడల్ ఆస్పత్రిగా ఎయిమ్స్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ధాత్ వాలియాకు వైరస్ సోకిందనే అంశంపై అధికార ప్రకటన మాత్రం వెలువడలేదు.

PIB chief KS Dhatwalia tests Covid-19 positive

Recommended Video

Hyderabad Journalist Passed Away In Gandhi Hospital Due To Covid 19

ధాత్ వాలియా కార్యాలయం నేషనల్ మీడియా సెంటర్ కూడా క్లోజ్ చేశారు. సోమవారం శానిటైజ్ చేస్తామని పేర్కొన్నారు. మంగళవారం కూడా తెరవబోమని తెలిపారు. అంతేకాదు ధాత్ వాలియా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లపై ఫోకస్ చేశారు. ఎన్‌ఎంసీ క్లోజ్ చేయడంతో కొద్దిరోజులు శాస్త్రీ భవన్‌లో విధులు నిర్వహించనున్నారు. ఇందులోనే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారు. ఎన్ఎంసీ భవన్ పూర్తిగా శానిటైజేషన్ చేసిన తర్వాత.. తెరిచే అవకాశం ఉంది.

English summary
Principal Director General of Press Information Bureau K S Dhatwalia has tested positive for Covid-19 and admitted to aiims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X