వీడియో వైరల్: యుద్ధ విమానంను పక్షి ఢీకొనడంతో పైలట్ ఏంచేశాడో చూడండి..!
అంబాలా: ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానంను ఓ పిట్ట ఢీకొంది. అందులోని పైలట్ వెంటనే గుర్తించి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. యుద్ధ విమానంను పక్షి ఢీకొట్టగానే అంబాలా ఎయిర్బేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ముందే అంటే విమానం గాల్లో ఉండగానే అందులోని ఇంధనం, ఇతర తేలిక బాంబులను కిందకు వదిలేశాడు. ఇలా చేయకపోతే భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడాన్ని అంతా కొనియాడారు.
యుద్ధ విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఓ పక్షి ఢీకొట్టడంతో ఇది జరిగిందని పైలట్ గ్రహించాడు. విమానంను పక్షులు ఢీకొంటే ఎలా రియాక్ట్ అవ్వాలనేదానిపై పైలట్లకు శిక్షణా సమయంలో నేర్పిస్తామని అయితే చాలా తక్కువ మంది చాకచక్యంతో వ్యవహరిస్తారని ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది. పైలట్ చాకచక్యంతో చాలా మంది పౌరుల ప్రాణాలు కాపాడినవాడయ్యాడని ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది.
#SavingLives: On the morning of 27 June19, an IAF Jaguar aircraft loaded with two additional fuel drop tanks & Carrier Bomb Light Stores
— Indian Air Force (@IAF_MCC) June 28, 2019
(CBLS) pods took off from AFS Ambala for a training
mission. Immediately after take off, the aircraft encountered a flock of
birds. pic.twitter.com/Mb0otqadVe
పక్షి ఢీకొనడంతో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి ఎలా స్పందించాలో తెలియదని అధికారులు చెప్పారు. కానీ ఈ పైలట్ మాత్రం సరైన సమయంలో సరిగ్గా స్పందించాడని కొనియాడారు. అసలు సమస్య ఏమిటో కొన్ని సెకన్లలోనే పసిగట్టగలిగాడని వెంటనే ఇంధనం ట్యాంకులను కిందకు వదిలివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. అయితే ఒక ఇంధనం ట్యాంకు అంబాలా సమీపంలోని నివాస ప్రాంతంలో పడిపోయిందని అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.