మార్కెట్లో ప్లాస్టిక్ కోడిగుడ్ల కలకలం
ఇప్పటికే ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టిస్తుంటే.. ఇప్పుడు ప్లాస్టింగ్ కోడి గుడ్లు కూడా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి.
డెహ్రాడూన్: ఇప్పటికే ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టిస్తుంటే.. ఇప్పుడు ప్లాస్టింగ్ కోడి గుడ్లు కూడా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్లో ప్లాస్టిక్ కోడిగుడ్లు కలకలం రేపాయి. హల్ద్వానీలో ఓ వ్యక్తి కోడి గుడ్లను ఉడికించగా... అవి ప్లాస్టిక్లా మారడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంపై స్పందించిన స్థానిక అధికారులు కోడిగుడ్లును పరీక్షించి ఏవైనా రసాయనాలు వాటిలో ఉన్నాయోమో తేలుస్తామని చెప్పారు. ఇటీవల పశ్చిమబెంగాల్లోనూ ఇవే తరహా గుడ్లు కలకలం సృష్టించాయి.
అవన్నీ ప్లాస్టిక్ గుడ్లు అని, వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో వాటిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్లాస్టిక్ కోడి గుడ్లు ఉన్నట్లు విచారణలో ఎక్కడా తేలలేదని చెప్పారు. అంతేగాక, నిర్భయంగా గుడ్లు తినవచ్చని స్పష్టం చేశారు.