సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: వంజరతోపాటు ఉన్నతాధికారులకు విముక్తి
ముంబై: గ్యాంగ్స్టర్ సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ డీఐజీ డీజీ వంజర, ఐఏఎస్ అధికారులు దినేష్, రాజ్కుమార్ పాండియన్లకు పూర్తిగా విముక్తి లభించింది. కేసు విచారణ సందర్బంగా వీరిపై అభియోగాలు కొట్టి వేయడానికి తాను వ్యతిరేకం కాదని సీబీఐ స్పష్టం చేయడంతో వీరిపై అభియోగాలను బాంబే హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
2005-06లో సోహ్రబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, వారి సహచరులు తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసు నుంచి తనను తప్పించాలని గుజరాత్ ఐపీఎస్ అధికారి విపుల్ అగర్వాల్ దరఖాస్తును కోర్టు అనుమతించింది.
కాగా, ఈ కేసు నుంచి గుజరాత్ మాజీ డీఐజీ వంజర, ఐపీఎస్ అధికారులు ఎంఎన్ దినేష్, పాండియన్లను తప్పించడాన్ని సవాల్ చేస్తూ.. సోహ్రబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోపిపుచ్చింది. అయితే, అభియోగాలను కొట్టివేయడాన్ని సోహ్రబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ న్యాయవాది గౌతం తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు.