సర్ అనొద్దు .. రాహుల్ అని పిలవండి .. విద్యార్థులతో కాంగ్రెస్ అధినేత
చెన్నై : ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నారు. ఇవాళ చెన్నైలో విద్యార్థులతో చిట్ చాట్ చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పనిలోపనిగా మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మీతో ఒక్కసారైనా సమావేశమయ్యారా ? సమస్యలను ఆలకించారా అని ప్రశ్నించారు.
మోదీపై నాది నిజమైన ప్రేమే .. ఆప్యాయత చూపని వారిది ఇష్టమే కాదు: రాహుల్ సెటైర్లు
సర్ అనొద్దు .. రాహుల్ అని పిలవండి
స్టెల్లా మేరిస్ కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా రాహుల్ ను స్టూడెంట్స్ సర్ అని సంభోదించారు. దీంతో రాహుల్ కల్పించుకొని పేరుతో పిలువాలని .. సర్ అనొద్దని సూచించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.
కుర్రాడిలా వచ్చిన రాహుల్
సాధారణంగా రాహుల్ గాంధీ తెల్లని కుర్తాలో పర్యటిస్తుంటారు. కానీ చెన్నై విద్యార్థులతో సమావేశం సందర్భంగా .. ముదురు రంగు టీ షర్ట్, జీన్స ప్యాంటు ధరించి వచ్చారు. డ్రెస్సింగ్ స్టైల్ మారడంతో డిఫరెంట్ గా కనిపించారు రాహుల్
హామీలు హామీలుగానే ..
ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. బడ్జెట్ సెషన్ లోనే మహిళా బిల్లు గురించి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఆ మాటే మరచిపోయారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారే గానీ చేయలేదని విమర్శించారు.