హత్య కేసులో ఇంటర్ విద్యార్థి అరెస్టు: ఒంటరిగా ఉన్న 9వ తరగతి అమ్మాయిని చంపేశాడు !
డబ్బుల కోసం విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఇంటర్ విద్యార్థిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కారిమంగళం సమీపంలోని ఉత్తన్ డికవుండనూర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ వ
చెన్నై: డబ్బుల కోసం విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఇంటర్ విద్యార్థిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కారిమంగళం సమీపంలోని ఉత్తన్ డికవుండనూర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తన్ డికవుండనూర్ లో సంజీవన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళనాడు ఆర్ టీసీ బస్సు డ్రైవర్ గా సంజీవన్ ఉద్యోగం చేస్తున్నాడు. సంజీవన్ కుమార్తె వనిషా (14) మాట్లంపట్టి పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆగస్టు 27వ తేదిన వనిషా ఇంటిలో ఒంటరిగా ఉంది.
సంజీవన్ భార్య ఇంటి సమీపంలో చిల్లరదుకాణం నిర్వహిస్తున్నది. ఆ రోజు సంజీవన్ భార్య బయటకు వెళ్లారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న వనిషా అదే రోజు హత్యకు గురైయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. వనిషా ఇంటిలో డబ్బులు లెక్కపెడుతున్నదని, నగదు కోసం ఆమెను హత్య చేశానని ఇంటర్ విద్యార్థి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.