సీరం అగ్నిప్రమాదం: కార్మికుల మృతి పట్ల ప్రధాని విచారం -రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మోదీ భేటీ
భారత్లో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణె కేంద్రంగా పనిచేసే బయోటెక్నాలజీ, ఫార్మా దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం చోటుచేసుకున్న అగ్నప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో సీరం ప్రముఖ పాత్ర పోషిస్తున్న దరిమిలా ఈ ప్రమాదంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం..
Recommended Video
పుణెలో సీరం ఇనిస్టిట్యూట్కు చెందిన నూతన ప్లాంట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీరం ప్రాంగణంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో వ్యక్తుల మరణం తననెంతగానో బాధించిందని, ఈ కష్టసమయంలో మృతుల కుటుంబాలకు శాంతి కలగాలని కోరుతున్నానని, గాయడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ మోదీ గురువారం ట్వీట్ చేశారు..
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ అదనపు ఉత్పత్తి కోసం సీరం సంస్థ నిర్మిస్తున్న భనవంలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 10 ఫైరింజన్లు మంటలు ఆర్పిన తర్వాత మృతదేహాలను గుర్తించారు. కార్మికుల మృతి పట్ల సీరం సీఈవో అదార్ పూనావాలా సైతం విచారం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తికావచ్చిన భవంతిలో వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే..
సీరంలో ఘోరం: ఐదుగురి ఆహుతి -పుణెలోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం
దేశంలో కరోనా వ్యక్సినేషన్ డ్రైవ్ వేగవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరుగనున్న భేటీలో.. వ్యాక్సిన్ తీసుకున్నవారి అనుభవాలను మోదీ అడిగితెలుసుకోనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన ప్రజలు.. వారి అనుభవాలను వినే అవకాశం దీని ద్వారా కలుగనుందని ప్రధానమంత్రి తెలిపారు. రేపటి సమావేశాన్ని అందరూ చూడాలని మోడీ కోరారు.