మోడీ... అమితాబ్బచ్ఛన్ కంటే గొప్ప నటుడు... ప్రియాంక గాంధీ
ఏడు దశల ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో గడువు ముగియడంతో పార్టీల మధ్య మటాల యుద్దాలకు తెరపడింది. అయితే ప్రచారానికి చివరిదశ కావడంతో నేతల మధ్య చివరి మాటల తూటాలు చెలరేగాయి.ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్లోని మిర్జాపూర్లో జరిగిన రోడ్ షోలో పాల్గోన్న ప్రియాంక గాంధీ ప్రధాని మోడీపై పలు వ్యాఖ్యలు చేశారు.
మోడీ అమితాబ్ బచ్చన్ కంటే గొప్పనటుడని అభివర్ణించారు.ఈనేపథ్యంలోనే మోడీ గొప్పనటుడని ప్రజలు ఎన్నుకున్నారని ఆయనకు అయనకు బదులుగా అమితాబ్బచ్చన్ ను ఎన్నుకుంటే బాగుండేదని ఆమే ఏద్దేవా చేశారు. మరోవైపు ఆయన నాయకుడు కాదని , ఒక నటుడిగానే తాను చూస్తానని అన్నారు.కాగా యూపిలో చివరి విడత ఎన్నికల్లో భాగంగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగనుంది. కాగా మోడీ హాయాంలో ఉద్యోగాలు లేక యువత నిరుద్యోగులుగా మారారాని అన్నారు.
ఓవైపు రైతులు రైతులు ఇబ్బందులు పడుతుంటే మోడీ మాత్రం బడా పారీశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రుపాయల అప్పులను మాఫీ చేశారని ఆమే ఫైర్ అయ్యారు. రైతుల అప్పులకు డబ్బులు అడిగితే మాత్రం లేవని చెప్పారని అన్నారు. ఈ అయిదేళ్ల మోడీ పాలనలో ప్రజలు విసిగిపోయారని ఈ సంధర్భంగా అన్నారు