అందరు కార్యకర్తల్లా.. ప్రధాని మోడీ స్వయంగా భోజనం తెచ్చుకున్నారు
బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వెంట లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. పార్టీ సహచరులతో కలిసి కూర్చొని భోజనం చేశారు.
న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వెంట లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. పార్టీ సహచరులతో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాన్ని బీజేపీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఈ ఆసక్తికర సన్నివేశం ప్రధాని మోడీ లోకసభ నియోజకవర్గం వారణాసిలో చోటుచేసుకుంది. కార్యకర్తల సమావేశానికి వచ్చిన మోడీ తన భోజనాన్ని తానే స్వయంగా తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలతో కలిసి తినడం గమనార్హం.
కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న ఓ ఫొటోను బీజేపీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ.. సమానత్వం బీజేపీ ఒక్కదానితో మాత్రమే సాధ్యమని పేర్కొంది. వారణాసిలో గురువారం మోడీ 26 వేల మంది బూత్ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు.
PM Shri @narendramodi interacted & had lunch with more than 26,000 booth workers belonging to over 1700 booths in Varanasi today. pic.twitter.com/DmOB2Ykrfp
— BJP (@BJP4India) 22 December 2016