అమెరికాలో తెలుగు జర్నలిస్టు మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
జర్నలిజంలో కంచిభొట్ల చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధాని మోడీ ప్రశంసించారు. కంచిభొట్ల బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందినవారు. రాష్ట్రంలోనే ఓ ఆంగ్ల పత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన.. తర్వాత పలు పత్రికల్లో పనిచేశారు.
ఆంగ్ల వార్తా సంస్థ యూఎస్ఐలోనూ పనిచేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి కుటుంబంతో సహా న్యూయార్క్లో స్థిరపడ్డారు. కాగా, ఆయన పదిరోజుల క్రితం కరోనా బారిపడ్డారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించినట్లు న్యూయార్క్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
కాగా, అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో భారతీయుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అమెరికా మొత్తం కరోనాతో 12,800 మందికిపైగా మరణించారు. కేవలం న్యూయార్క్ రాష్ట్రంలోనే 5400 మంది ప్రాణాలు కోల్పోయారు.
Deeply anguished by the passing away of Indian-American journalist Mr. Brahm Kanchibotla. He will be remembered for his fine work and efforts to bring India and USA closer. Condolences to his family and friends. Om Shanti. https://t.co/LXF8TOl4PZ
— Narendra Modi (@narendramodi) April 8, 2020
న్యూజెర్సీలో 44,416 మందికి కరోనా సోకగా.. 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే 1900 మరణాలు సంభవించడం గమనార్హం. మరోవైపు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3,99,667 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 22,020 మంది కోలుకున్నారు.
Recommended Video