భరతమాతను గౌరవించండి.. కాంగ్రెస్ పార్టీపై మోడీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ప్రజలు, వారి మనోభావాలు పట్టవని విమర్శించారు. జవాన్ల త్యాగాలను గుర్తించడం, గౌరవించడం అనే మాట ఉండదని దుయ్యబట్టారు. శుక్రవారం హర్యానాలో ప్రచారం నిర్వహించారు. గోహనలో ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్ నేతలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆ పార్టీకే రాజకీయాలే పరామావధి అని.. ప్రజల ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.
జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి గురించి సభలో ప్రస్తావించారు. కశ్మీర్ విభజన గురించి ఎవరికీ తెలుసు అని అడిగారు. ఆగస్టు 5 నుంచి కశ్మీర్లో కూడా రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శలకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రజల మంచి అంటే ఆ పార్టీకి గిట్టదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల అభిమతానికి ఆ పార్టీ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. ఇది సరికాదని వైఖరి మార్చుకోవాలని సూచించారు.
ఓ రాజకీయ పార్టీగా ప్రజల మంచి గురించి కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. కానీ ఆ పార్టీ మంచిని మరచిపోయిందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను విమర్శిస్తే ఓకే కానీ.. కానీ భరతమాతను గౌరవించాలని మోడీ సూచించారు. దీనిని ఎవరూ మరచిపోవద్దని సూచించారు. భరతమాతను గౌరవించకపోవడం సబబు కాదన్నారు. దీనిని ఎవరూ కూడా ఉపేక్షించబోరని తేల్చిచెప్పారు.