ప్రధాని అయ్యాక మోడీకి అహం పెరిగిపోయింది: అన్నా హజారే తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై అన్నాహజారే తీవ్రంగా మండిపడ్డారు. మోడీకి అహం పెరిగిపోయిందని విమర్శించారు. అందువల్లే మూడేళ్ల నుంచి తాను రాసిన లేఖలకు ఆయన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్పడీలో ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీకి తాను ఈ మూడేళ్లలో ముప్పైకి పైగా లేఖలు రాశానని చెప్పారు. కానీ ఒక్క దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. మోడీకి ప్రధానిని అన్న అహం పెరిగిపోయిందన్నారు.
అందువల్లే సమాధానం ఇవ్వలేదన్నారు. మోడీకి ఆ పదవి చేపట్టాక అహం పెరిగిందని వ్యాఖ్యానించారు. ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు.
కాగా, మార్చి 23వ తేదీ నుంచి జన్ లోక్పాల్, రైతుల కోసం భారీ ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు హజారే తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజల మద్దతు కోసం అట్పడీలో ర్యాలీ నిర్వహించారు.