వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని అయ్యాక మోడీకి అహం పెరిగిపోయింది: అన్నా హజారే తీవ్రవ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై అన్నాహజారే తీవ్రంగా మండిపడ్డారు. మోడీకి అహం పెరిగిపోయిందని విమర్శించారు. అందువల్లే మూడేళ్ల నుంచి తాను రాసిన లేఖలకు ఆయన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్‌పడీలో ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీకి తాను ఈ మూడేళ్లలో ముప్పైకి పైగా లేఖలు రాశానని చెప్పారు. కానీ ఒక్క దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. మోడీకి ప్రధానిని అన్న అహం పెరిగిపోయిందన్నారు.

PM Modi didn't reply to my letters because of his ego: Anna Hazare

అందువల్లే సమాధానం ఇవ్వలేదన్నారు. మోడీకి ఆ పదవి చేపట్టాక అహం పెరిగిందని వ్యాఖ్యానించారు. ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు.

కాగా, మార్చి 23వ తేదీ నుంచి జన్ లోక్‌పాల్, రైతుల కోసం భారీ ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు హజారే తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజల మద్దతు కోసం అట్‌పడీలో ర్యాలీ నిర్వహించారు.

English summary
Anti corruption crusader Anna Hazare has alleged that Prime Minister Narendra Modi has an "ego of his prime ministership", claiming that that was the reason why the prime minister was not responding to his letters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X