మోడీ ప్రసంగంలో ఆ 'పదం' లేదు, సోషల్ మీడియాలో కామెంట్లు
ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో 'మిత్రోం' అని సంబోధిస్తుంటారు. కానీ డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన 'దోస్తోం' అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో 'మిత్రోం' అని సంబోధిస్తుంటారు. కానీ డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన 'దోస్తోం' అన్నారు. ఇది ఇప్పుడు చర్చకు దారి తీసింది.
మోడీ ప్రసంగంలో మిత్రోం లేకపోవడం పైన సోషల్ మీడియాలో చమక్కులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిత్రోం పదం ట్రెండ్ అవుతోంది.
అసలు సమస్యలపై దాటవేత: మోడీ ప్రసంగం నిరుత్సాహకరం!
మిత్రోం నుంచి ఉర్దూ పదం దోస్తోంకి మోడీ మారిపోయారని, క్రైస్తవుల నూతన సంవత్సర పండుగకి శుభాకాంక్షలు తెలిపారని, పేదలకు అనుకూల పథకాలు ప్రకటిస్తున్నారని, ఇప్పుడు ఆయన ఉదారవాద సెక్యులర్ అని మాధవన్ నాయర్ ట్వీట్ చేశారు.
తొలుత మనకు నోట్లను దూరం చేశారని, ఇప్పుడు మనకు ఇష్టమైన మిత్రోంను దూరం చేశారని మరొకరు కామెంట్ చేశారు. మోడీ మిత్రోం అనలేదని, అంటే మనల్ని అన్ ఫ్రెండ్ చేయలేదు కదా అని మరొకరు విసుర్లు విసిరారు.