పురాతన కాలం నాటీ సాంప్రదాయం డస్ట్బిన్కు చేరింది :ప్రధాని మోడీ
ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పోందడంతో ప్రధానమంత్రి మోడీ స్పందించారు. త్రిపుల్ తలాక్ రద్దు అవడం వల్ల దేశం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఒక పురాతన మరియు మధ్యయుగం నాటి అచారానికి ముగింపు లభించిందని ,అప్పటి ఆచారం డస్ట్బిన్కే పరితమైందని పేర్కోన్నారు.
పార్లమెంట్ ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి దేశంలో జరుగుతున్న చారీత్రక తప్పును సరిచేసిందని పేర్కోన్నారు. బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చిందని వ్యాఖ్యానించారు. బిల్లు వల్ల రానున్న రోజుల్లో లింగ సమానత్వం నెలకొందనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షా సైతం బిల్లు పాస్ కావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు గోప్ప దినంగా అభివర్ణించారు. ఈ సంధర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టిన ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు.బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు అమిత్ షా కృతజ్ఝతలు తెలిపారు.