ఢిల్లీలో మెట్రో రైలును ప్రారంభించిన మోడీ, కేజ్రీవాల్కు అందని ఆహ్వనం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని మెజెంటా మెట్రో లైనులో మెట్రో రైలును ప్రారంభించారు. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ మందిర్ వరకు ఈ మెట్రో రైలు నడవనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మాత్రం ఆహ్వనం అందలేదు.
ఈ మెట్రో రైలును ప్రారంభించిన తర్వాత మెట్రో రైలులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగితో పాటు పలువురు ప్రముఖులు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ మెట్రో రైలు మార్గంతో నోయిడా, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గిపోతోంది.12.64 కి.మీ మేర ఈ రైలు మార్గం ఉంది.2017లో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన ఈ మూడో మెట్రో లైన్గా రికార్డుల్లోకెక్కింది.
Noida: PM Narendra Modi onboard #DelhiMetro after inauguration of a stretch of the new Magenta line. The line connects Botanical Garden in Noida with Kalkaji Mandir in Delhi. pic.twitter.com/oEzY4f66wi
— ANI (@ANI) December 25, 2017
ఈ ఏడాది జూన్ మాసంలో కొచ్చి మెట్రో లైన్ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత హైద్రాబాద్ మెట్రో లైన్ను ఈ ఏడాది నవంబర్ మాసంలో ప్రారంభించారు. తాజాగా ఇవాళ ఢిల్లీ మెట్రో రైలును ప్రారంభించారు మోడీ.
ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఆహ్వానం అందలేదు.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి తమకు అధికారికంగా ఆహ్వనం అందలేదని కేజ్రీవాల్ కార్యాలయవర్గాలు తెలిపాయి.
అయితే మెట్రో రైలులో ప్రయాణం సురక్షితంగా ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటు ధరలో ఛార్జీలు ఉండాలనేది తమ విధానం కేజ్రీవాల్ ఆఫీసు వర్గాలు చెబుతున్నాయి.
2018 మార్చి నాటికి ఈ రైల్వే లేన్ను జనక్పురి వరకు పొడిగించనున్నారు.ఢిల్లీ మెట్రో రైలు ఆటోమెటిక్ ఫ్లాట్ఫామ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. స్క్రీన్ డోర్లు ప్రతి స్టేషన్లో ఉంటాయని అధికారులు తెలిపారు.స్టేషన్ వద్దకు రైలు చేరుకొన్నప్పుడు మాత్రమే రైలు డోర్లు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.డ్రైవర్ లేకుండానే ఈ రైలు నడుస్తోంది. అయితే తొలి రెండేళ్ళపాటు మాత్రం డ్రైవర్ సహయంతోనే ఈ రైళ్ళను నడపనున్నారు.