వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ 150 కి.మీ పాదయాత్ర... అక్టోబరు 2న ప్రారంభం

|
Google Oneindia TeluguNews

జాతిపిత మహాత్మ గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడి నిర్ణయించారు. ఈ సంధర్భంగా నెల రోజుల పాటు 150 కిలోమీటర్ల మేర పాద యాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించారు. కాగా పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని మోడి పిలుపునిచ్చాడు. కాగా గాంధీ జయంతిన చేపట్టిన పాదయాత్ర పటేల్ జయంతి వరకు కొనసాగాలని ప్రధానమంత్రి పార్టీ నాయకులకు, ఎంపీలకు సూచించారు.

PM Modi padayatra on 150th Gandhi Jayanti

ప్రధాని మోదీ దాదాపు నెల రోజుల పాటు వారణాసిలో పాదయాత్ర చేపట్టనున్నారు.ప్రధానితోపాటు పార్టీ ఎంపీలకు కూడా వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ, మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేపట్టాలని లోక్‌సభ సభ్యులకు పిలుపునిచ్చారు.కాగా మహాత్మ గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుండి పాదయాత్రను ప్రారంభించి.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 వరకూ కొనసాగనుంది.ఇక పార్టీ ఎంపీలు లేని లోక్‌సభ స్థానాల్లో రాజ్యసభ ఎంపీలు పాదయాత్రలో పాల్గోననున్నట్టు ప్రకటించారు.

English summary
Prime Minister Narendra Modi asked BJP MPs to embark on a 150-km-long ‘padayatra’ in their constituencies between October 2 and 31 period, to mark the birth anniversaries of Mahatma Gandhi and Vallabhbhai Patel, Parliamentary Affairs Minister Pralhad Joshi said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X