ఈసారీ సైలెంట్గా కానిచ్చిన మోదీ -కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని -వైరస్ పోరాడుదామంటూ
ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ -19 వ్యాక్సిన్ రెండో డోసును కూడా తీసుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయనకు నర్సులు టీకా వేశారు. మార్చి 1న టీకా తొలి డోసు తీసుకున్న ప్రధాని, 40 రోజుల తర్వాత ఇవాళ రెండో డోసు తీసుకున్నారు.
Recommended Video
రెండు సందర్భాల్లోనూ ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉదయమే ఆస్పత్రికి వచ్చి, సైలెంట్ గా పని కానిచ్చేశారు ప్రధాని. కేంద్ర సంస్థలు భాగస్వాములుగా ఉన్న భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకానే ప్రధాని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..
పరిషత్ పోలింగ్ షురూ -భారీ భద్రత -47శాతం కేంద్రాలు సమస్యాత్మకం -కౌంటింగ్ వద్దన్న కోర్టు
కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో స్వయంగా వెల్లడించారు. అర్హులైనవారంతా వెంటనే టీకాలు పొందాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ''ఇవాళ ఎయిమ్స్ లో నా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నాను. కరోనా మహమ్మారిని ఓడించడానికి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న మార్గాల్లో టీకా ఒకటి. అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిన్ ద్వారా పేరు రిజిస్టర్ చేయించుకుని టీకాలను పొందండి'' అని ప్రధాని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటం, కొత్త కేసులు రోజుకు దాదాపు లక్ష చొప్పున వస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అదే సమయంలో వ్యాక్సిన్ల పంపిణీ కూడా వేగంగా సాగుతున్నది. కాగా, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. వ్యాక్సిన్ల కొరత లేదని, అర్హత కలిగిన అందరికీ అందుబాటులో టీకాలను ఉంచామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ చెప్పారు. గురువారం నాటికి 9కోట్ల పైచిలుకు డోసుల పంపిణీ జరిగినట్లు పేర్కొన్నారు.