రాజ్యసభలో మోడీ ఫేర్వెల్ స్పీచ్: సీఎం రమేష్ రాజీనామా, ఇదీ కారణం
Recommended Video
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ప్రసంగించారు. వారిని ఆయన ప్రశంసించారు. వారి భవిష్యత్తు బాగుండాలని ఆయన ఆశించారు.
ప్రతి ఎంపీ కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరు దేశ భవిష్యత్తు కోసం తమవంతు సహకారం అందించారన్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న టీడీపీ నేత సీఎం రమేష్ రాజీనామా చేశారు. ఇటీవల ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున ఆయన ఎంపికయ్యారు.
All those who are retiring from the house (Rajya Sabha) today have their own significance and each of them tried their best to contribute to the glorious future of this country. I wish you success in future: PM Modi in Rajya Sabha pic.twitter.com/d1RWOdXelP
— ANI (@ANI) March 28, 2018
సాంకేతిక కారణాల దృష్ట్యా ఒకే సమయంలో అటు తెలంగాణ, ఇటు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేశారు.
వాస్తవంగా ఏప్రిల్ 2 వరకు సీఎం రమేష్ పదవీ కాలం ఉంది. కానీ ఏపీ నుంచి ఎన్నికైనందున ఆయన తెలంగాణ పేరిట కొనసాగరాదని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారని తెలుస్తోంది.