వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చౌకీదారంటే భయపడుతున్నారు.. అందుకే నన్ను..! మోడీ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఆగ్రా : దేశానికి కాపలాదారుగా ఉన్న తనను చూసి ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. తనకు అధికారం లేకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా వారు ముందుకెళుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో గంగాజల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకరి ముఖం మరొకరు చూసుకునేందుకు సైతం ఇష్టపడని నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతుండటం విచిత్రంగా ఉందన్నారు.

 Pm modi said that opposition leaders afraid with chowkidar

ప్రజలకు మేలు చేసే విధంగా వివిధ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 100 రోజుల్లో 7 లక్షల మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. దాదాపు 99 శాతం వస్తువులను 28శాతం జీఎస్టీ శ్లాబు నుంచి తగ్గించామని చెప్పారు. గంగా నది ప్రక్షాళన తమ ఎజెండాలో ఒకటని చెప్పిన మోడీ.. ఆగ్రాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో ఒక అడుగు ముందుకు పడిందన్నారు.

English summary
Prime Minister Narendra Modi has said that the opposition leaders are afraid of seeing him as the guard of country. Also he accused that they were try to defeat him in next elections, in that way blamed the BJP for propagating lies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X