7 వారాల నుంచి నోరు మెదపలేదు, మోడీ సైలెన్స్పై చిదంబరం ఫైర్..
ప్రధాని మోడీపై మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రాగన్ కాచుకొని ఉన్న 7 వారాల నుంచి నోరు మెదపలేరు అని విరుచుకుపడ్డారు. మోడీ, ఇతర ప్రముఖులు కూడా ఎవరూ మాట్లాడటలేదు అని పేర్కొన్నారు. దీంతో 20 మంది సైనికులు దేశం కోసం ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. ముందే మేల్కొంటే పరిస్థితి ఘర్షణకు దారితీసేది కాదని ఉదహరించారు.
సోమవారం రాత్రి గాల్వాన్ వ్యాలీలో చైనా-భారత్ మధ్య జరిగిన ఘర్షణలో భారీ ప్రాణనష్టమే జరిగింది. భారత్ నుంచి 20 మంది చనిపోగా.. చైనాకు చెందిన 43 మంది చనిపోయారు. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన ఒకరు కూడా చనిపోయారని చిదంబరం గుర్తుచేశారు. శత్రుదేశాన్ని తక్కువ అంచనా వేయడమే అందుకు కారణం అని పేర్కొన్నారు.
అంతకుముందు ఆర్మీ గానీ, రక్షణశాఖ కానీ మృతుల వివరాల గురించి పేర్కొనలేదని తెలిపారు. రాత్రికి రావచ్చొని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కానీ రాత్రి ఇండియన్ ఆర్మీ నుంచి ప్రకటన వెలువడింది. మధ్యాహ్నాం విదేశాంగ శాఖ కూడా ప్రకటన వచ్చింది. దానిపై కూడా చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మాత్రం భారత్ జవాన్లు 20 మంది, చైనాకు చెందిన 43 మంది చనిపోయారని అధికార ప్రకటన వెలువడింది.