భారత్-అమెరికా వాణిజ్య పరంగా సహజ భాగస్వాములు: ప్రధాని మోడీ
భారత్ అమెరికాల మధ్య జరగనున్న వాణిజ్య సదస్సుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో భారత్ అమెరికా దేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. వాణిజ్యరంగంలో భవిష్యత్తులో ఇరు దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదే సమయంలో వాణిజ్యం, పెట్టుబడులపై కూడా ప్రధాని మాట్లాడారు. అంతేకాదు కోవిడ్-19కు ముందు కోవిడ్-19కు తర్వాత పరిస్థితి ఎలా మారిందనే అంశంపై కూడా ప్రధాని మోడీ ఫోకస్ చేశారు.
ఇక విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.ఇప్పటికే తను ప్రసంగించబోయేదానిపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు తన ప్రసంగం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, వర్జీనియా సెనేటర్, ఐక్యరాజ్యసమితికి అమెరికా మాజీ దౌత్యాధికారి నిక్కీ హేలీలు కూడా పాల్గొన్నారు. ఇక భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు, ప్రధాని ప్రసంగం పై మినిట్-టూ-మినిట్ హైలైట్స్
Looking forward to addressing the #IndiaIdeasSummit, organised by @USIBC today at 9 PM. Will be sharing my views on ‘Building a Better Future.’ Do watch. https://t.co/70XBBZRghL
— Narendra Modi (@narendramodi) July 22, 2020