సీఎంలతో ఇవాళ, రేపు మోడీ డిస్కషన్, లాక్డౌన్ గురించే చర్చ..
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో 5.0 లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతోన్న తరుణంలో.. ఇవాళ, రేపు (మంగళ, బుధవారాల్లో) ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకోనున్నారు. వారి సలహా మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి.
5.0 లాక్ డౌన్లో భాగంగా ఇప్పటికే అన్ లాక్ 1.0 అమల్లో ఉంది. మాల్స్, రెస్టారెంట్లు తెరిచాయి. కానీ దేశంలో రోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల వరకు నమోదవతున్నాయి. ప్రధాని మోడీ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత సీఎంలతో విడివిడిగా ఇంటరాక్ట్ అవుతారు. మంగళవారం ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాలు.. బుధవారం ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాలతో ఇంటరాక్ట్ అవుతారు.
Recommended Video
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకోనున్నారు. కరోనా వైరస్ విజృంభించండతో మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే సీఎంల అభిప్రాయం తీసుకొని.. పొడగిస్తూ వస్తున్నారు. మంగళవారం సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఆరోది అని అధికారులు తెలిపారు.