వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔను, మోడీ మరిచిపోయి ముంబై మెట్రో కోసం వెళ్లిపోయారు, షాక్ లో బీజేపీ లీడర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి బీఎస్. యడియూరప్ప ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటి సారి ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వచ్చారు. అయితే ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలు, వరదల గురించి ప్రభుత్వంతో చర్చించకుండా ప్రధాని నరేంద్ర మోడీ ముంబై వెళ్లిపోవడంతో సీఎంతో పాటు బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. ఔను, మోడీ మరిచిపోయి ముంబై మెట్రో కోసం వెళ్లిపోయారని బీజేపీ నేతలు అంటున్నారు.

అసెంబ్లీలో సెక్స్ వీడియో చూస్తే దేశద్రోహం కాదు, అమిత్ షా బుద్దిమంతుడు, బీజేపీ మంత్రి !అసెంబ్లీలో సెక్స్ వీడియో చూస్తే దేశద్రోహం కాదు, అమిత్ షా బుద్దిమంతుడు, బీజేపీ మంత్రి !

మోడీకి స్వాగతం

మోడీకి స్వాగతం

శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వచ్చారు. కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలా, ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరుకు ఆలస్యంగా వచ్చిన ప్రధాని మోడీ ఎలాంటి సమావేశాలు, చర్చలు పెట్టకుండా విశ్రాంతి తీసుకున్నారు.

చంద్రయాన్ 2

చంద్రయాన్ 2

ప్రధాని మోడీ చంద్రయాన్-2 ప్రయోగం చివరిదశ వరకు వీక్షించారు. అయితే చివరి నిమిషంలో చేదు అనుభవం ఎదురు కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు మీకుఅండగా మేము ఉన్నామని ప్రధాని మోడీ ధైర్యం చెప్పారు. శనివారం ఉదయం చంద్రయాన్- 2 ప్రయోగం గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడాడు.

ముంబై మెట్రో కోసం !

ముంబై మెట్రో కోసం !

ఇస్రో నుంచి నేరుగా ప్రధాని మోడీ ముంబైలో మెట్రో ప్రారంభించడానికి వెళ్లిపోయారు. ప్రధాని మోడీ బెంగళూరు వచ్చిన తరువాత కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం గురించి వివరించాలని సీఎం యడియూరప్ప, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు భావించారు.

ప్రధానితో మాట్లాడాలని !

ప్రధానితో మాట్లాడాలని !

కర్ణాటక సీఎం యడియూరప్ప, బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడటానికి వీలులేకుండా పోయింది. సీఎం అయిన తరువాత రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన యడియూరప్ప వరద ముప్పు ప్రాంతాలను ఆదుకోవడానికి నిధులు మంజూరు చెయ్యాలని మనవి చేశారు.

ఔను, ప్రధాని వెళ్లిపోయారు !

ఔను, ప్రధాని వెళ్లిపోయారు !

కర్ణాటకకు ఇంత వరకు నష్ట పరిహారం కింద నిధులు మంజూరు కాలేదు. ఈ విషయంపై సీఎం యడియూరప్పను మీడియా ప్రశ్నించగా ఔను, వరద ముప్పు ప్రాంతాల గురించి ఎలాంటి చర్చ జరగలేదని, ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిపోయారు అని సమాధానం ఇచ్చారు. కర్ణాటక గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఏ మాత్రం పట్టించుకోలేదని బీజేపీ నేతలు షాక్ కు గురైనారు.

English summary
Prime minister Narendra Modi yesterday arrived to Bengaluru. He did not had any meeting with state government, He did not had meeting about Karnataka flood, he went back early.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X