కొత్త నోట్ల ముద్రణ: ఎక్కడెంత?, మరో 6నెలలు పడుతుందా?
న్యూఢిల్లీ:
పెద్ద
నోట్లు
రద్దైన
నేపథ్యంలో
వాటి
స్థానంలో
కొత్త
నోట్ల
భర్తీకి
మరింత
సమయం
పట్టే
అవకాశమున్నట్లు
తెలుస్తోంది.
నోట్లను
ముద్రించే
ముద్రణాలయాల
సామర్థ్యాన్ని
బట్టి
చూస్తే
మరో
ఆరు
నెలల
వరకు
పట్టే
అవకాశం
కనిపిస్తోంది.
ముఖ్యంగా
రూ.500
నోట్లు
కొత్తవి
ముద్రించేందుకు
ఆరు
నెలల
సమయం
పడుతుందని
గణాంకాలు
సైతం
వెల్లడిస్తున్నాయి.
500, 1,000 నోట్ల స్థానంలో కొత్త 500, 2,000 నోట్లను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆశావాదమే అవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
నాసిక్, దేవాస్ 40శాతం
కాగా, నాసిక్, దేవాస్ ప్రెస్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాటిని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా వార్షిక నివేదిక ప్రకారం ఈ రెండు ముద్రణాలయాలు దేశంలోని మొత్తం కరెన్సీలో ఏటా 40 శాతం నోట్లను ముద్రించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
60శాతం మైసూరు
ఇక సాల్బోని, మైసూరు ముద్రణాలయాలు భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంపీఎల్)లో భాగంగా ఉన్నాయి. ఇవి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి చెందినవి. దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 60 శాతం నోట్లను ఇవి ముద్రిస్తున్నాయి. ఇవి ఒక ఏడాదిలో రెండు షిఫ్టులు పనిచేస్తే 1600 కోట్ల నోట్లను ముద్రించగలవు.
కాగా, మొత్తం మన ముద్రణాలయాలు రెండు షిఫ్టుల్లో పనిచేస్తే ఏడాదికి 26.66 వందల కోట్ల కరెన్సీని ముద్రించగలవు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నట్టు అవి మూడు షిఫ్టుల్లో పనిచేస్తే నాలుగువేల కోట్ల కరెన్సీని (అవి ఏ నోట్లయినా సరే) ముద్రించగలవు.
గణాంకాల
ప్రకారం..
రూ.500,
రూ.1000
నోట్లను
రద్దు
చేయకముందు
చెలామణిలో
ఉన్న
మొత్తం
కరెన్సీ
విలువ
రూ.17.54
లక్షల
కోట్లు.
ఇందులో
45
శాతం
రూ.500
నోట్లు
రూ.7.89
లక్షల
కోట్ల
విలువైనవి
ఉండగా,
39
శాతం
వెయ్యి
నోట్లు
రూ.6.84
లక్షల
కోట్ల
విలువైనవి
ఉన్నాయి.
చెలామణిలో
ఉన్న
మొత్తం
కరెన్సీలో
వీటి
విలువ
84
శాతం.
మిగిలినవి
రూ.5
నుంచి
రూ.100
నోట్ల
వరకు
ఉన్నాయి.
మరో
మాటలో
చెప్పాలంటే..
రూ.500
నోట్లు
1578
కోట్లు,
రూ.1000
నోట్లు
684
కోట్లు
చెలామణిలో
ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం రూ.684 లక్షల కోట్ల విలువైన రూ.1000 నోట్ల స్థానంలో రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ విలువకు తగినట్లుగా 342 కోట్ల నోట్లను ముద్రిస్తే సరిపోతుంది. 2000 నోట్ల ముద్రణ సెప్టెంబర్లోనే ప్రారంభమైందని చెప్తున్నారు కాబట్టి, ఇప్పటికే అవసరమైన నోట్ల ముద్రణ జరిగి ఉంటుందని భావించవచ్చు.
నవంబర్ 10న రూ.500 నోట్ల ముద్రణను ప్రారంభించి ఉంటే మన ముద్రణాలయాలు రెండు షిఫ్టులు పనిచేసినా 1578 లక్షల కోట్ల నోట్ల ముద్రణకు 5.9 నెలలు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మే నెల వరకు పూర్తి స్థాయిలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని విశ్లేషిస్తున్నారు.