మోడీతో షేక్హ్యాండ్: బ్రిటన్ ప్రిన్స్కి అచ్చు(వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ షేక్ హ్యాండ్ ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఓ చేయి కందిపోయింది. ఆ చేయిపై మోడీ చేతి అచ్చులు పడ్డాయి. ఆ కంది పోయిన చేయి ఎవరిదో కాదు. భారత్కు వచ్చిన బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ది.
మనదేశంలో పర్యటించిన బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ దంపతులకు ప్రధాని మోడీ విందు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, విందుకు వచ్చిన యువరాజు విలియమ్కు మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తన స్టయిల్లో మోడీ పలకరించారు.
ఆ బంధం ఎంత బలంగా ఉందంటే.. మోడీ ఇచ్చిన హ్యాండ్ షేక్కు యువరాజు చేతి కందిపోయింది. మోడీ చేతి వేలి ముద్రలు ప్రిన్స్ చేతి మీద అచ్చు పడ్డాయి.
దేశాధినేతలు అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం సహజం. అయితే ప్రధాని మోడీ ఇచ్చిన ఆతిథ్యం మాత్రం ప్రిన్స్కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. కాగా, ఆన్లైన్లో ఆ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. టీ అమ్మిన ప్రధాని పవర్ అది అంటూ కొందరు వ్యాఖ్యానించారు.