రాజకీయాల్లో కొన్ని సార్లు మాత్రమే శత్రువులు, నరేంద్ర మోడీ, ఖార్గే ఫోటో వైరల్, ప్రధాని ప్లాన్!
న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదని కేవలం కొన్ని సందర్బాల్లోనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖార్గే కలిసి వెలుతున్న ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఖార్గే కలిసి వెలుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చిరునవ్వులు
పార్లమెంట్ సమావేశాలకు ముందు సాంప్రధాయ పద్దతిలో జరిగే అఖిలపక్ష సమావేశానికి వెళ్లే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే చెయ్యి చెయ్యి పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ సమావేశానికి వెలుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీజేపీ, కాంగ్రెస్ ఫైట్
పార్లమెంట్ లో అయినా, బయట అయినా రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. అవకాశం చిక్కిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద మల్లికార్జున ఖార్గే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను ఏమీ తక్కువ కాదు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సైతం కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ప్రధాని మోడీ ప్లాన్
మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖార్గే, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తదితరులు చిరునవ్వులు చిందిస్తూ కలిసి వెళ్లారు. పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా జరిగేలా సహకరించాలని ప్రధాని మోడీ అందరికీ మనవి చేశారు. మోడీ ప్లాన్ ఎంత వరకు ఫలిస్తుందో వేచిచూడాలి.
ప్రతిపక్షాలు పక్కా స్కెచ్
పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా జరగడానికి అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలకు మనవి చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆందోళన చెయ్యడానికి పక్కా ప్లాన్ తో సిద్దం అయ్యాయి. ఆగస్టు 10వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనేక బిల్లులు ప్రవేశ పెట్టి ప్రతిపక్షాల మద్దతు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.