పర్యాటక ప్రాంతంగా మోడీ టీ విక్రయించిన ప్లేస్ ..
వాడ్నగర్ : చాయ్వాలా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నరేంద్ర మోడీ. ఔను మోడీ ప్రస్థానం టీ అమ్ముతూ కొనసాగించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి .. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నతమైన ప్రధానమంత్రి పదవీని అధిష్టించారు. రెండోసారి ప్రధానిగా అఖండ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన టీ అమ్మిన స్టాల్ ఎక్కడ ఉంది ? దానిని ఎలా తీర్చిదిద్దారు అనే ప్రశ్న మెదలుతుంది. కదా దానికి సమాధానం ఈ కథనం.
గుజరాత్లోని వాడ్నగర్లో మోడీ టీ అమ్మారు. ఆ టీ స్టాల్కు సంబంధించిన ఫోటోలు స్టోరీలో మీరు చూడొచ్చు. నరేంద్ర మోడీ టీ విక్రయించిన చోటను గుజరాత్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. గుజరాత్ పర్యాటక శాఖ దానిని టూరిస్ట్ ప్లేస్గా మార్చింది. ఇటీవల ఆ ప్రాంతానికి గుజరాత్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పరిశీలించారు. దానిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అంతేకాదు మోడీ నడయాడిన ప్రాంతాన్ని గ్లాస్ కవర్తో కప్పి ఉంచుతామని పేర్కొన్నారు. మిగతా చోటును పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు తీర్చిదిద్దుతామని ప్రకటించారు.