వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్ధాలోనూ ఉల్లంఘించలేదు : మోదీకి మరోసారి ఈసీ రిలీఫ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం నుంచి మరోసారి ఊరట కలిగింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు ఎన్నికలనిబంధనలను ఉల్లంఘించడం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో వార్ధాలో హిందువులపై చేసిన వ్యాఖ్యలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కాదని ఈసీ తెలిపింది.

రెండోసారి రిలీఫ్ ..

రెండోసారి రిలీఫ్ ..

గతనెల 1న మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ .. హిందువులు ఎక్కువ ఉన్న చోట పోటీ చేయడానికి విపక్ష నేతలు భయపడుతున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి రాహుల్ అమేథీతోపాటు కేరళలోని వాయనాడ్ లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఈసీ .. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాదని స్పష్టంచేసింది.

నిశీతంగా పరిశీలించాకే ..

నిశీతంగా పరిశీలించాకే ..

వార్దాలో మోదీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని ఎన్నికల సంఘం పేర్కొంది. నిశీతంగా పరిశీలించాకే అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కాదని నిర్ధారించినట్టు తెలిపింది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు కిందకు రాదని తేల్చిచెప్పింది.

మోదీకి రిలీఫ్ ...

మోదీకి రిలీఫ్ ...

పాకిస్థాన్ పై భారత్ చేసిన దాడులను సభల్లో మోదీ ప్రస్తావించడంపై కూడా కాంగ్రెస్ అభ్యంతరం తెలుపగా .. అదీ కూడా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని మంగళవారం ఈసీ క్లారిఫై చేసింది. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్, మాయావతి, అజాంఖాన్, సాద్వీ ఠాకూర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన సంగతి తెలసిందే.

English summary
Prime Minister Narendra Modi's speech at Maharashtra's Wardha, where he accused the Congress of insulting the Hindus through its party chief Rahul Gandhi's candidature from Kerala's Wayanad, does not violate the Model Code, the Election Commission said on Tuesday. This is the first time the Commission took a call on the several complaints pending against the Prime Minister.In his speech on April 1 from Maharashtra's Wardha, the Prime Minister had accused the Congress of insulting the Hindus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X