వార్ధాలోనూ ఉల్లంఘించలేదు : మోదీకి మరోసారి ఈసీ రిలీఫ్
న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం నుంచి మరోసారి ఊరట కలిగింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు ఎన్నికలనిబంధనలను ఉల్లంఘించడం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో వార్ధాలో హిందువులపై చేసిన వ్యాఖ్యలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కాదని ఈసీ తెలిపింది.
రెండోసారి రిలీఫ్ ..
గతనెల 1న మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ .. హిందువులు ఎక్కువ ఉన్న చోట పోటీ చేయడానికి విపక్ష నేతలు భయపడుతున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి రాహుల్ అమేథీతోపాటు కేరళలోని వాయనాడ్ లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఈసీ .. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాదని స్పష్టంచేసింది.
నిశీతంగా పరిశీలించాకే ..
వార్దాలో మోదీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని ఎన్నికల సంఘం పేర్కొంది. నిశీతంగా పరిశీలించాకే అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కాదని నిర్ధారించినట్టు తెలిపింది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు కిందకు రాదని తేల్చిచెప్పింది.
మోదీకి రిలీఫ్ ...
పాకిస్థాన్ పై భారత్ చేసిన దాడులను సభల్లో మోదీ ప్రస్తావించడంపై కూడా కాంగ్రెస్ అభ్యంతరం తెలుపగా .. అదీ కూడా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని మంగళవారం ఈసీ క్లారిఫై చేసింది. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్, మాయావతి, అజాంఖాన్, సాద్వీ ఠాకూర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన సంగతి తెలసిందే.