మోడీ చదివేవన్నీ రాసిన స్క్రిప్టులే, అలా ఐతే పరువుపోయేది: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ఇచ్చే ఇంటర్వ్యూల్లో రాసి ఇచ్చిన స్క్రిప్టులే చదువుతారని ఆరోపించారు. గత శుక్రవారం మోడీ పాల్గొన్న ఇంటర్వ్యూను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
గత వారం మోడీ సింగపూర్, మలేషియా, ఇండోనేషియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా సింగపూర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. 'బహిరంగ సభలో అప్పటికప్పుడు ప్రశ్నలను అడిగి తీసుకొన్న వ్యక్తి మోడీ. ఆ ప్రశ్నలకు వెంటనే అనువాదం చేసిన సమాధానాల స్క్రిప్టు సిద్ధంగా ఉంటుంది' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
'మంచిది, ఆయన నిజమైన ప్రశ్నలు తీసుకోలేదు. ఒకవేళ అదే జరిగితే నిజంగా పరువుపోయేది' అని రాహుల్ ఎద్దేవా చేశారు. ఇదే విషయమై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కూడా మోడీని విమర్శించారు.