పీఎన్బీ స్కాం: మరో రూ.1300 కోట్లు మోసం చేసిన నీరవ్ మోడీ, తాజాగా వెలుగులోకి
Recommended Video
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మరో కుంభకోణం జరిగినట్టు బ్యాంకు వెల్లడించింది. ఇప్పటికే రూ.11,300 కోట్లకు నీరవ్ మోడీ ముంచినట్లు తేలగా, ఆయన మరో రూ.1,322 కోట్ల మేర మోసం చేసినట్టు తాజాగా వెలుగు చూసింది.
నీరవ్ మోడీ, ఆయన మామ, వ్యాపార భాగస్వామి అయిన మేహుల్ చోక్సీతో కలిసి రూ.1,322 కోట్ల మేర అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు బ్యాంకు పేర్కొంది. ఫలితంగా ఈ కుంభకోణం మొత్తం రూ.12,622 కోట్లకు చేరుకుంది.
ఈ విషయాలను ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ వెల్లడించింది. నీరవ్ మోడీ, మెహూల్ చోక్సీలు కలిసి 204 డాలర్ల విలువైన అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు తేలిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రకటించింది. దీంతో పీఎన్బీ షేర్లు మరింత కిందకు దిగాయి. 52 వారాల కంటే దిగువకు దిగింది.
మరోవైపు, నీరవ్ మోడీని భారత్కు రప్పించేందుకు సీబీఐ చర్యలను వేగవంతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.