గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్: ఇది బీజేపీకే ఎదురు దెబ్బ, సల్మాన్ ఖుర్షిద్!
న్యూఢిల్లీ: గోవాలో ఇటీవల ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీ ఓటమి కాదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం బీజేపీకే ఓటమి అని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోల్ కత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అనంతరం మీడియాతో మాట్లాడారు. గోవాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం మాపార్టీ ఓటమి కాదని సల్మాన్ ఖుర్షిద్ చెప్పారు.
అయితే రాజకీయాల కోసం బీజేపీ తన సిద్దాంతాలను గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని సల్మాన్ ఖుర్షిద్ ఆరోపించారు. పార్టీ సిద్దాంతాలను గాలికి వదిలిన బీజేపీదే అసలైన ఓటమి అని సల్మాన్ ఖుర్షిద్ అన్నారు.
గోవాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దయానంద్, సుభాష్ శిరోద్కర్ అనే ఇద్దరు బీజేపీలోకి జంప్ అయ్యారు. శిరోడా శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే సుభాష్ శిరోద్కర్ సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు.