జయలలిత స్పృహలోని స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు: షుగర్ లెవెల్స్ 508, కుట్ర జరిగిందా !
జయలలిత ఆరోగ్యం విషయంలో పోయెస్ గార్డెన్ సిబ్బంది నిర్లక్షం చేశారని వెలుగు చూసింది.
చెన్నై: జయలలిత ఆరోగ్యం విషయంలో పోయెస్ గార్డెన్ సిబ్బంది నిర్లక్షం చేశారని వెలుగు చూసింది. 2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి జయలలిత స్పృహలోని స్థితిలో అపోలో ఆసుపత్రిలో చేరారని గురువారం తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.
జయలలిత కోరడంతోనే వీడియో తీశాం, మమ్మల్ని రక్షించుకోవడానికి కాదు: టీటీవీ దినకరన్!
జయలలిత ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆమెకు షుగర్ లెవెల్స్ 508 (ఎంజీ) ఉందని మీడియాలో ప్రసారం అయ్యింది. జయలలిత ఐస్ క్రీం ఎక్కువగా తిన్నందువలనే షుగర్ లెవెల్స్ పెరిగాయని వైద్యులు అంటున్నారు. జయలలిత ఆరోగ్యం కోసం పోయెస్ గార్డెల్ లో ఉన్న వైద్యులు, నర్సులు ఆ సమయంలో ఏం చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జయలలిత షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఆమె స్పృహ కోల్పోయేవరకు వైద్యులు ఏం చేస్తున్నారు ? అనే విషయం ఇప్పుడు అంతు చిక్కడం లేదు. పోయెస్ గార్డెన్ సిబ్బంది నిర్లక్షంతోనే జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురైనారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అమ్మ అభిమానులు అంటున్నారు.
జయలలిత వేలిముద్రలు: ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు, చిక్కుల్లో !
అపోలో ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు పోయెస్ గార్డెన్ కు వెళ్లారని గురువారం వెలుగు చూసింది. అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులు స్నేహ, అనిష్, సురేష్ అనే ముగ్గురు పోయెస్ గార్డెన్ వెళ్లి జయలలిత ఆరోగ్య పరిస్థితి పరిశీలించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సమాచారం.
మొత్తం మీద జయలలిత మరణం మిస్టరీగా మారింది. విచారణ కమిషన్ లో మొత్తం విషయాలు వెలుగు చూస్తే అమ్మ మరణానికి అసలు కారణం ఏమిటి ? ఏమైనా కుట్ర జరిగిందా ? అనే విషయాలు వెలుగు చూస్తాయని అమ్మ అభిమానులు అంటున్నారు.