మోనిక రేప్లో మరో షాక్: గుడ్లు, ఫ్రిజ్లోని ఫుడ్ తిని..
పనాజీ: గోవాకు చెందిన ప్రముఖ పెర్ఫఅయూమ్ డిజైనర్ మోనికా ఘర్దే హత్య కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. అక్టోబర్ 6న ఎనిమిది గంటల పాటు నరకం చూపించిన నిందితుడు రాజ్ కుమార్.. హత్య అనంతరం ఆమె ఇంట్లో తిని నింపాదిగా వెళ్లాడని తెలుస్తోంది.
అతను రెండు కోడి గుడ్లు వేసుకొని తిన్నాడు. ఆ తర్వాత ఫ్రిజ్లో ఉన్న ఆహార పదార్థాలను తిన్నాడు. అంతేకాదు, పెరిగిన తన గడ్డం షేవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కర్నాటకకు పారిపోయాడు. కాగా, పోలీసులు అతను హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఆ కత్తిని ఇంకా స్వాధీనం చేసుకోలేదు.
కాగా, మోనికా హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ నిందితుడు. గోవా పోలీసులు అతనిని శనివారం అర్ధరాత్రి బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మోనికను హత్య చేసిన అనంతరం నిందితుడు రాజ్ కుమార్ ఆమె మొబైల్, ఏటీఎం, కార్డును దొంగతనం చేసి నాసిక్లో డబ్బు డ్రా చేసి కర్నాటక చేరుకున్నాడు.
మోనికా హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసే ముందు హంతకుడు ఆమెను ఎనిమిది గంటలపాటు నరకం చూపించాడు. అక్టోబర్ 6న తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో ఆమె హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.