ఘోరం: వైద్యం చేయాల్సిన డాక్టరు.. అమ్మాయిలతో వ్యభిచార రాకెట్..
గుజరాత్ రాష్ట్రంలోని అమ్రెలీ జిల్లాకు చెందిన ఓ డాక్టరు నలుగురు అమ్మాయిలను జైపూర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
జైపూర్ : వైద్యం చేయాల్సిన డాక్టరు అమ్మాయిలతో వ్యభిచార రాకెట్ నిర్వహించిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో వెలుగుచూసింది. గుజరాత్ రాష్ట్రంలోని అమ్రెలీ జిల్లాకు చెందిన ఓ డాక్టరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
జమ్మూ, కాశ్మీర్, ముంబయి, ఉత్తరప్రదేశ్, జైపూర్ ప్రాంతాలకు చెందిన నలుగురు అమ్మాయిలను జైపూర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడని అందిన సమాచారం మేరకు పోలీసులు వలపన్ని డాక్టర్ ను పట్టుకున్నారు.
జైపూర్ నగరంలోని వైశాలీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో గుట్టుగా వ్యభిచారం సాగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు విటుడి వేషంలో ఓ పోలీసు అధికారిని ఆ అపార్ట్ మెంట్ లోకి పంపించారు.
డాక్టరుతోపాటు నలుగురు అమ్మాయిలను వలపన్ని పట్టుకున్నారు. అయితే జైపూర్ నగరంలో జరిగే వైద్య సదస్సులో పాల్గొనేందుకు తాను జైపూర్ వచ్చానని ఆ డాక్టర్ పేర్కొంటున్నాడు. నలుగురు అమ్మాయిలపై పోలీసులు పిటా కింద కేసు నమోదు చేశారు.