వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయలలిత సమాధి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన ఎమ్ అరుణరాజ్ అనే కానిస్టేబుల్ మెరీనా బీచ్లోని జయలలిత మెమోరియల్ వద్ద తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనా స్థలంలోనే అతను మరణించాడు. . మృత దేహాన్ని దగ్గర్లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. వ్యక్తిగత కారణాలే అయి ఉండొచ్చన్న అనుమానిస్తున్నారు.
అయితే అరుణ్ ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. జయలలిత సమాధి వద్దకు వచ్చి అరుణ్ రాజ్ ఎందకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
English summary
A 23-year-old police constable posted at late chief minister J Jayalalithaa's memorial shot himself dead early Sunday morning.
Story first published: Sunday, March 4, 2018, 13:57 [IST]