కిడ్నాప్ చేసిన నలుగురు పోలీసులను చంపేశారు
రాయ్పూర్: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నలుగురు పోలీసులను హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో నలుగురు పోలీసులను సోమవారం సాయంత్రం మావోయిస్టులు అపహరించిన విషయం విదితమే.
అపహరించిన పోలీసులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన గుమ్డా గ్రామంలో చోటు చేసుకుంది. హత్యకు గురైన పోలీసులు జయదేవ్ యాదవ్, మంగాల్ సోదీ, రాజు తేల, రామా మజ్జీ. మావోయిస్టులపై దాడులకు ప్రతీకారంగానే పోలీసులను హతమార్చినట్లు తెలుస్తోంది.
సదరు పోలీసుల మృతదేహాలను బుధవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కు గురైన ప్రాంతానికి కేవలం 5 కి.మీ దూరంలో వీరి మృతదేహాలను స్థానికులు కనుగోన్నారు.
బీజాపూర్ జిల్లాలో కుట్రూకి వెళ్తున్న బస్సును సోమవారం రాత్రి అడ్డగించి... అందులో ప్రయాణిస్తున్న నలుగురు పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ డిజిపి అమర్నాథ్ ఉపాధ్యాయ సోమవారం రాత్రి ప్రకటించారు.