వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్రాస్ ఐఐటీలో ఉద్రిక్త పరిస్థితులు, లాఠీచార్జ్?

|
Google Oneindia TeluguNews

చెన్నై: మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరు హడలిపోతున్నారు. విద్యార్థులు, పోలీసుల మద్య వాగ్వివాదం, తోపులాటలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందు జాగత్ర చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

మంగళవారం ఉదయం మద్రాస్ ఐఐటి క్యాంపస్ లో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. తరువాత విద్యార్థులు పోలీసుల మీదకు తిరగబడ్డారు.

నిరసనలు తెలిపే హక్కు తమకుందని విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులను చితకబాదడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యాంపస్ ఆవరణంలోకి వెళ్లడానికి మీడియాకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు పలు జాగ్రతలు తీసుకున్నారు.

Police, Protesters Clash Outside IIT-Madras

ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారని ఫిర్యాదులు రావడంతో మద్రాస్ ఐఐటీలోని అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ (ఏపీఎస్ సీ) అనే విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై దేశంలోని పలు ఐఐటీ కాలేజ్ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

దేశంలోని ఐఐటీ కాలేజ్ లలోని విద్యార్థులు మంగళవారం ధర్నాలు నిర్వహించి ఫేస్ బుక్ లో ఫోటోలు అప్ లోడ్ చేశారు. అదే విదంగా తమిళనాడులోని పలు పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థలు, సంఘాలు మద్రాస్ ఐఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు.

English summary
Around 100 protesters have been detained. The media was not allowed inside the IIT Madras campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X