డ్రైవర్ భార్య అరెస్టు , 80 లక్షల నగదు స్వాధీనం
ఎటిఎంలలో డిపాజిట్ చేయకుండా వ్యాన్ తోసహ పారిపోయిన డ్రైవర్ సెల్వరాజ్ సతీమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుండి 79.8 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. సెల్వరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెంగుళూరు :ఎటిఎంలలో పెట్టాల్సిన నగదుతో పారిపోయిన ఎటిఎం వ్యాన్ డ్రైవర్ ను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుండి 80 లక్ష రూపాయాల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఎటిఎం వ్యాన్ డ్రైవర్ సెల్వరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెంగుళూరులలోని పలు ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసేందుకు ఉంచిన వ్యాన్ తో పాటు డ్రైవర్ పారిపోయాడు. నవంబర్ 23వ, తేదిన సెల్వరాజ్ అనే డ్రైవర్ ఎటిఎంలలో జమచేయాల్సిన నగదుతో సహ పారిపోయాడు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే బెంగుళూరు వసంత్ నగర్ ప్రాంతంలో వ్యాన్ , తుపాకీ, 45 లక్షల రూపాయాల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో బెంగుళూరులోని పలు ఎటిఎంలలో కొత్త కరెన్సీని డిపాజిట్ చేసేందుకు వ్యాన్ లో తరలిస్తున్నారు. సెల్వరాజ్ నడిపే వాహనంలో సుమారు 1.37 కోట్లను సమకూర్చారు. నగరంలోని పలు ఎటిఎంలలో ఈ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంది.ఈ నగదును ఎటిఎంలలో డిపాజిట్ చేయకుండా సెల్వరాజ్ వాహనంతో పాటు పారిపోయాడు.
సెల్వరాజ్ రెండు మాసాల క్రితమే వేరు కాపురం పెట్టాడు. సెల్వరాజ్ తల్లిని పోలీసులు ప్రశ్నిస్తే కొడుకు ఉన్న చిరునామాను చెప్పింది. ఈ చిరునామా ఆధారంగా పోలీసులు సెల్వరాజ్ సతీమణిని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి 79.8 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.సెల్వరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.