వివాదాస్పదం: ‘ముస్లింలను కండోమ్స్లా వాడుకుంటున్నారు’
సమాజ్వాదీ పార్టీ యువనేత, మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబూ ఆజ్మీ కుమారుడు ఫర్హాన్ ఆజ్మీ.. ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
ముంబై: సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు అబూ ఆజ్మీ కుమారుడు, ఆ పార్టీ యువనేత ఫర్హాన్ ఆజ్మీ.. ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలు రాజకీయ పార్టీలు ముస్లింను కండోమ్స్లా వాడుకుంటున్నాయని ఆరోపించారు.
ముంబైలో జరగనున్న బీఎంసీ ఎన్నికల ప్రచార సభకు తన తండ్రితో కలిసి హాజరైన సందర్భంగా ఫర్హాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కండోమ్లతో పోల్చడం ద్వారా మొత్తం ముస్లిం జాతిని ఫర్హాన్ అవమానపరిచారని భారతీయ జనతా పార్టీ ముంబై శాఖ ఉపాధ్యక్షుడు హైదర్ ఆజం మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలు చేసినందుకు ముస్లిం జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పర్హాన్ ఇంటిముందు భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరోవైపు ఫర్హాన్ వ్యాఖ్యలు సమాజ్వాదీ పార్టీ వైఖరిని బట్టబయలు చేశాయని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ అన్నారు.
ముస్లింలను అవమానించిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, చాలా మంది ముస్లిం నాయకులు ఫర్మాన్ ఇంటిముందు పెద్ద ఎత్తున మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఫర్హాన్ మాత్రం ముస్లింల దురవస్థను ఎత్తిచూపేందుకు ఉదాహరణగా మాత్రమే తాను మాట్లాడానని వివరించారు. కాగా, బాలీవుడ్ నటి అయేషా టకియా భర్తే ఈ ఫర్హాన్ అజ్మీ.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications