వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ పొంగల్: పండుగ పూట తమిళనాడుకు జాతీయ ప్రముఖులు -రాహుల్, భగవత్, నడ్డా అక్కడే

|
Google Oneindia TeluguNews

ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఈసారి పొంగల్ పండుగ రాజకీయంగానూ కీలకంగా మారింది. ఎన్నడూ లేనిది జాతీయ నేతలంతా తమిళగడ్డపై పండుగను జరుపుకొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మోహన్ రావ్ భాగవత్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఈ ముగ్గురూ తమిళనాడులోనే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

పొంగల్ పూట ముగ్గురు ప్రముఖులూ ఒకే రాష్ట్రంలో వివిధ వేడుకల్లో పాల్గొనడం విశేషం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ గురువారం కదంబుడీ చిన్నమ్మన్ ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోపూజలో పాల్గొని, పొంగల్ ఉత్సవాలను ప్రారంభించారు. మోహన్ భాగవత్ చెన్నై పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ రెండు రోజుల్లో చెన్నై ప్రముఖులు, యువ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. అటు..

శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదంశోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం

political pongal: Rahul, Bhagwat, Nadda visits Tamil nadu for festival ahead assembly polls

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమిళనాడులో పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. పొంగల్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. నడ్డా పర్యటనలోనే అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై క్లారిటీ రానుందని, ఏఐఏడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కూడా జరగొచ్చని వినికిడి. ఇక..

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పొంగల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం తర్వాత మధురై జిల్లాకు వెళ్లిన రాహుల్.. అక్కడ జల్లికట్టు పోటీలను తిలకించారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరుగనున్నాయి.

English summary
Tamil speakers celebrate their annual harvest festival, Pongal, over the next four days beginning today. Coinciding with similar revelries across the country, such as Bihu in Assam and Uttarayan in Gujarat, Tamil Nadu's biggest celebration comes merely months ahead of the state's assembly polls. Not surprisingly, key leaders from across the political spectrum are set to mark their presence at the goings on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X