ఈవీఎం బటన్ ఎలా నొక్కాలని అడిగిన ఓటర్: నొక్కి చూపించిన ఏజెంట్
చండీగఢ్: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బటన్లను ఎలా నొక్కాలో తెలియక తికమక పడ్డారు కొందరు ఓటర్లు. దీన్ని సాకుగా తీసుకుని వారి ఓట్లను కూడా తానే వేసేశాడో ప్రబుద్ధుడు. అతను ఓ జాతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్. తమ ఓటును తాము వేసుకోలేకపోయామని, సదరు ఏజెంట్ వేశాడంటూ ఓ మహిళా ఓటరు ఫిర్యాదు చేయడం, దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో అతని బండారం బట్టబయలైంది. ఆ పోలింగ్ ఏజెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు.
एक नेता को जिताने के लिए ये तरीका सही नहीं है! ! ये संविधान, कानून और नैतिकता के खिलाफ भी है! ! ! गाँव असावटी पलवल (हरियाणा) pic.twitter.com/m2euOOBkf2
— SHAHID KURESHI (@UqAsmTfpZGNwK0e) May 12, 2019
ఆరో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆదివారం హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫరీదాబాద్ పరిధిలోని అసౌటీ పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు ముగ్గురు మహిళలు. వారికి ఈవీఎంలపై ఉన్న బటన్లను ఎలా నొక్కాలో తెలియలేదు. ఏ బటన్ నొక్కితే ఏ అభ్యర్థికి ఓటు పడుతుందోనే అనుమానంతో పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న ఓ జాతీయ పార్టీ పోలింగ్ ఏజెంట్ను సహాయం అడిగారు. దీన్ని సాకుగా తీసుకున్న ఆ పోలింగ్ ఏజెంట్.. ఈవీఎంలపై బట్లను ఎలా నొక్కాలో వివరిస్తూ, వారి ఓట్లను తానే వేసేశాడు.
Matter taken very seriously by the administration of Faridabad district. ARO Bharat Bhushan Gogia HCS rushed to the spot . Soon he was joined by the observer SH. Sanjay Kumar who investigated the entire matter.
— DISTRICT ELECTION OFFICE FARIDABAD (@OfficeFaridabad) May 12, 2019
దీన్ని గమనించిన పోలింగ్ సిబ్బంది ఒకరు ఈ తతంగాన్నంతటినీ తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి హర్యానా ఎన్నికల అధికారుల దృష్టిలో పడింది. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు అధికారులు. ఈ ఘటనపై ఓ నివేదిక అందించాలని అసౌటీ పోలింగ్ కేంద్రం సూక్ష్మ పరిశీలకుడికి సూచించారు. ఎన్నికల సిబ్బంది, మహిళా ఓటర్ ఫిర్యాదు మేరకు అధికారులు ఆ పోలింగ్ ఏజెంట్ను అరెస్టు చేశారు.